370 పైగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కపాసుకుద్ది మత్స్యకారులు

ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలో 2018 లో పవన్ కళ్యాణ్ ప్రజపోరాట యాత్రను కపాసుకుద్ది గ్రామంలో గంగమ్మ పూజ చేసి శ్రీకారం చుట్టారు. అదే స్పూర్తితో జనసేన ఎంతో ప్రతష్టాత్మకంగా చేపట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కపాసుకుద్ది గ్రామానికి చెందిన సుమారు 370 మందికి పైగా మత్స్యకారులు జనసేన సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం చేసుకున్నసబ్యులకు సభ్యత్వ కిట్లును ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త దాసరి రాజు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.