ఇది జనసేన విజయం: గొల్లపల్లి అనురాధ
*చెల్లూరు ఎంపీటీసీ పిర్యాదుపై స్పందించి సమస్యలను పరిష్కరించిన అధికారులు…
రాయవరం: రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో ప్రజల పడుతున్న ఇబ్బందులను గుర్తించి ముఖ్యంగా మూడు సమస్యలను మార్చ్19న జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఎంపీటీసీ -1 గొల్లపల్లి అనురాధ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం అధికారులు పిర్యాదు మేరకు స్పందించి.. క్రింద తెలిపిన మూడు సమస్యలను పరిష్కరించడం జరిగింది.
- పసలపూడి నుండి చెల్లూరు (సూర్యారావు పేట వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు) మెయిన్ రోడ్ బాగు చేయడం..
- గ్రామంలో పాడైన విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ ఫార్మర్ వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని..
- అంగన్ వాడి సెంటర్లలో కోడి గుడ్ల నాణ్యత గురించి..
ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ నాపై నమ్మకంతో గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యదిక మెజారిటీతో గెలిపించినందుకు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. వాటిని పరిష్కరించడమే నా లక్ష్యం అని పేర్కొన్నారు. గ్రామంలో సమస్యలను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఇది జనసేన విజయం.. అంటే ప్రజా విజయంగా భావిస్తున్నానని తెలిపారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలి అని కోరుకుంటున్నానని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-15-at-2.51.47-PM-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-15-at-2.51.47-PM-1-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-15-at-2.51.48-PM-473x1024.jpeg)