RR vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్-2020లో భాగంగా షార్జా మైదానంలో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తిరుగులేని విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఢిల్లీ..హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అంకిత్ రాజ్పుత్, టామ్ కరన్ స్థానంలో ఆండ్రూ టై, వరుణ్ అరోన్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు స్మిత్ వెల్లడించాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ వివరించాడు.