రవణం స్వామి నాయుడు పుట్టినరోజు వేడుకలు

*విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర ఆధ్వర్యంలో.. రవణం స్వామి నాయుడు పుట్టినరోజు వేడుకలు

విజయనగరం: అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు, మెగాభిమానుల రధసారధి రవణం స్వామి నాయుడు పుట్టినరోజు సందర్బంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పాత బస్టాండ్ వద్దనున్న శ్రీ సిద్ది బుద్ది సహిత వరసిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ సంస్థ వారి పట్టణ నిరాశ్రుయల వసతి గృహంలో ఉన్న వృద్ధులకు, అనాధులకు అల్పాహారం అందించారు.

ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ.. ప్రపంచంలో మెగాఫ్యామిలీ అభిమానులందరిని ఒకే తాటిపైకి తెచ్చి వారందరినీ సేవామార్గం, ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే నాయకులు రవణం స్వామి నాయుడు అని, ఏ అభిమాని కష్టంలో ఉన్నా నేనున్నానంటూ ఆదుకునే మహోన్నత వ్యక్తి స్వామి నాయుడు అని, మా మెగాభిమానులందరికి ఇటువంటి ఆదర్శమూర్తి, స్ఫూర్తి ప్రధాతగా రవణం స్వామి నాయుడు నిలుస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి లోపింటి కళ్యాణ్, జనసేన నాయకులు ముదిలి శ్రీనివాస్, దువ్వు రాము పాల్గొన్నారు.