రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం అంతర్వేది దేవస్దానం పంచాయితి పరిధిలో ఊసురుతోట ప్రాంతంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి జనసేనపార్టీ తరుపున అంతర్వేది దేవస్దానం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపిటిసి భైరా నాగరాజు, దంగేటి బాబి తదితరులు పాల్గొన్నారని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.