జనసైనికుడికి అంతిమ వీడ్కోలు పలికిన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం

ఖమ్మం: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందిన జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గం క్రియాశీలక సభ్యుడు ఆవుల ఉపేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం.

రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాలూరి ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ దుంపటి శ్రీనివాస్ సూచనలు మేరకు.. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డేగల రామచంద్రరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ క్రిష్ణా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గుంత సత్యనారాయణ, మాలిక్, వెంకటేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు.. జనసేన క్రియాశీలక సభ్యుడు ఆవుల ఉపేందర్ అంతిమయాత్రలో పాల్గొని.. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన క్రియాశీలక సభ్యత ప్రమాద భీమా 5 లక్షల రూపాయలను త్వరలో రాష్ట్ర నాయకులతో చర్చించి అందజేస్తామని భరోసాని ఇచ్చారు.