జనసేన నాయకుల ఆధ్వర్యంలో వంతెన ప్రారంభం

రాజోలు, గొంది గ్రామం(సాయి నగర్ గ్రూప్) నందు వంతెన నిర్మాణ నిమిత్తం జనసేన నాయకులు ఆకన బాబ్జీ నాయుడు, రావూరి నాగు ఆర్థిక సహాయంతో వంతెన నిర్మించడం జరిగింది. జనసేన గొంది గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లు వెంకటరాజుచే వంతెన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకన బాబ్జీ నాయుడు, రావూరి నాగు, గొంది జనసేన ఊపాధ్యక్షులు పోతు రామకృష్ణ, దాసరి నరసింహ స్వామి (వార్డు మెంబర్), చెల్లుబోయిన వెంకటేశులు, గ్రూపు పెద్దలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.