ఏపీ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపింది. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులని వెల్లడించింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల కార్యక్రమం చేపట్టనుంది.