ఎస్సీ కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ.. బాధిత కుటుంబానికి జనసేన భరోసా

సింగరాయకొండ మండలం, మూలగుంటపాడు పంచాయతీలో.. వెంకటేశ్వర కాలనీ లో ఎస్సీ కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం జనసేన పార్టీ కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ పులి మల్లికార్జున రావు బాధితులు కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది. ఈ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని, మీకు మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, కందుకూరు మండల అధ్యక్షులు మదన్, సింగరాయకొండ జనసేన నాయకులు, కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, షేక్ వాహిద్, చోప్పర రాణా మరియు జనసైనికులు పాల్గొన్నారు.