పవన్ కళ్యాణ్ అభిమాని కుటుంబానికి తాడిపత్రి జనసేన అండ

పెద్దవడుగూరు మండలంలోని లక్షుమ్ పల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమాని కె.రామాంజినేయులు అనే వ్వక్తి రెండు నెలలు క్రిందట గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన కుటుంబాన్ని తాడిపత్రి జనసేన నాయకులు పరామర్శించి అదే గ్రామానికి చెందిన పెద్ది రాజు 100 కేజీల బియ్యం, రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించి ఆ కుటుంబానికి భవిషుయత్తులో ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఆ కుటుంబంలో మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి జనసేన నాయకులు కుందుర్తి నరసింహా చారి, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్, జనసైనికులు మాదినేని గోపాల్, ఆచ్చుకట్ల అల్తాఫ్ఫ్, షేక్ సాధక్ వలి, ఇమామ్ వలి, గైబు సాబ్, పెద్దిరాజు, బాల పెద్దిరాజు, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.