అన్నదాతకి జనసేన అండగా ఉంటుంది: శ్రీమతి కాంతి శ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ అన్నదాత కి జనసేన అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి.. తాళ్లవలస, లావేరు, వెంకటాపురం మూడు పంచాయతీల్లో పొలంలో పనిచేస్తున్న రైతులు కలవడానికి నేరుగా పొలంలో కి వెళ్లారు. ఈ సందర్భంగా కాంతి శ్రీ రైతులతో మాట్లాడుతూ.. కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తన కష్టార్జితంలో నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం.. జనసేన పార్టీలో రైతుల కోసం పొందుపరిచిన మేనిఫెస్టో గురించి వివరించారు. అదేవిధంగా రైతు పక్షాన జనసేన పార్టీ నిలబడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కాంతి శ్రీ తో రైతులు మాట్లాడుతూ.. ఎరువులు విత్తనాలు సబ్సిడీలు లేవు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని కష్టాల్లో కి నెట్టేసింది అని రైతులు చెప్పుకొచ్చారు‌. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు కోల రాజేష్, కాకర్ల బాబాజీ, శ్రీను, కోటి, సతీష్, నీలాం నాయుడు, అలాగే జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.