కార్యకర్తల శ్రేయస్సుకోసం ఆలోచించే ఏకైక పార్టీ జనసేన: ఆదాడ మోహనరావు

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ

విజయనగరం: జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఒకటవ డివిజన్, లంకాపట్నంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాగాయకుడు అదాడ మోహనరావు చేతులుమీదుగా కిట్లు పంపిణీ చేసిన అనంతరం ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దేశంలోనే పార్టీ కార్యకర్తలకోసం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ అని.. దీనికి శ్రీకారం చుట్టిన జనసేన అధినేతకు కార్యకర్తలు అందరూ రుణపడి ఉంటారని అన్నారు.

కార్యకర్తలకు అనుకోని ప్రమాదాల వలన గాయాలు పాలైనా కొంత భీమా ఉండడం.. అనుకోకుండా మరణించినా ఆ కుటుంబానికి ఐదు లక్షలు భీమా సదుపాయం కల్పించడం గొప్ప విషయమని అంటూ.. సభ్యత్వాలు తీసుకున్న ప్రతీ ఒక్కరూ పార్టీ బలోపేతానికి అహిర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్, లోపింటి కళ్యాణ్, లంకాపట్నం నాయకులు కుమార్, గోవింద్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.