ప్రజారోగ్యమే జనసేన ద్యేయం
పాలకొండ నియోజకవర్గం: వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా పాలకొండ నగర ప్రజల ఆరోగ్య దృష్ట్యా డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా నగరంలోని కాలువలలో పూడిక తీత, క్లోరినేషన్, వీధుల్లో దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ చేయాలని తదితర అంశాలపై గురువారం శ్రీయుత పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ కి పాలకొండ టౌన్ జనసైనికులు పోరెడ్డి ప్రశాంత్, పోట్నూరు రమేష్, బోను చంటి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమస్యలపై సానుకూలంగా స్పందించి.. తప్పని సరిగా ఇవన్నీ చేయిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-23-at-7.26.34-PM.jpeg)