సి ఎల్ నాయుడు విద్యా సంస్థల అధినేతను కలిసిన జనసైనికులు

పాలకొండలో జనసేన పార్టీని బలోపేతం చేసేదిశగా శుక్రవారం పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మాజీ సర్పంచ్, వైస్ ఎంపిపి, డాక్టర్ సి ఎల్ నాయుడుకి (సి ఎల్ నాయుడు విద్యా సంస్థల అధినేత) పాలకొండ టౌన్ జనసైనికులు పోరెడ్డీ ప్రశాంత్, పొట్నురు రమేష్, కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలును, పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేసిన 30 కోట్లు ఆర్ధిక సహాయాన్ని వివరించడం జరిగింది. వారికి పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ… జనసేన పార్టీకి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది అని కొనియాడారు. మీ లాంటి పెద్దల సలహాలు, సూచనలు కావాలని అడగడం జరిగింది.