నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా ఏర్పేడు మండలంలో పర్యటించిన వినుత కోటా

*నో మై కాన్స్టిట్యూఎన్సీ: 27 వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా.. పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏర్పేడు మండలంలోని పల్లం పంచాయతీలో పల్లం పేట, పల్లం పేట హరిజనవాడ, పల్లం పేట ఎస్ టి కాలనీ గ్రామాల్లో పర్యటించి.. ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

పల్లం పేట గ్రామంలో సమస్యలు: స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజీ కాలువలు లేవు, కొన్ని డ్రైనేజీ కాలువలు నిరుపయోగంగా ఉన్నాయి, సీసీ రోడ్లు లేవు.

పల్లంపేట హరిజనవాడ & ఎస్ టికాలనీ సమస్యలు: డ్రైనేజీ కాలువలు, పారిశుధ్యం, స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్లు సమస్యలను గ్రామస్థులు వినుతకి తెలియజేశారు.
సమస్యలను మండల అధికారుల, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు వినోద్, లోక రాయల్,నితీష్ కుమార్,చందు చౌదరి, లక్ష్మణ్ యాదవ్ , మునికుమార్, వెంకటరమణ, అశోక్, మునిశేఖర్ , శీను, చలపతి,భాను,మురుగ, గురుప్రసాద్, జనసైనికులు పాల్గొన్నారు.