కంచికచర్లలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

ఉమ్మడి కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలోని క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం కంచికచర్ల పట్టణం వసంత కాలనీలో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర ఘనంగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేనీ విధంగా జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జనసైనుకుల శ్రేయస్సు కోసం వ్యక్తిగత ప్రమాద భీమాను కలిపించడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి అజయ్ బాబు, నాయిని వెంకట్ సత్యం, తేప్పాలి వెంకట్రావు, తోట మహేష్ జనసైనికులు పాల్గొన్నారు.