గుంటూరులో జనసేనలో చేరికలు

  • పార్టీ కండువా మెడలో వేసి ఆహ్వానించిన గాదె

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు సమక్షంలో గుంటూరు మున్సిపాలిటీ 13, 15 వార్డుల నుంచి యువత పార్టీలో చేరడం జరిగింది. వీరిని పార్టీ జెండా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించిన గాదె. నూతనంగా పార్టీలోకి చేరినవారు మంత్రి రాహుల్, తన్నీరు ఏడుకొండలు, శ్రీధర్, గూడపాటి సైదులు షేక్ ఇస్మాయిల్, బీరం అరవింద్, వెంకటేష్, మల్లికార్జునరావు, బోలె హనీష్, గూడపాటి సాంబశివరావు తదితరులు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కమిటీ సభ్యులు కోడిగంటి రవి, నెల్లూరు రాజేష్, తన్నీరు గంగరాజు పాల్గొన్నారు.