మానవత్వం చాటుకున్న పితాని

ముమ్మిడివరంనియోజకవర్గఒ, తాళ్ళరేవు మండలం, జీ వేమవరం గ్రామంలో మందపల్లి చంటి వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె అవిల, బ్రెయిన్ క్యాన్సర్ తో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి ₹5000, రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. మరియు చల్లంగి పేట గ్రామంలో డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగ అవకాశాలు లేక రోజువారి కూలిగా సెంట్రింగ్ పని చేసుకుంటూ ప్రమాదవశాత్తు గాయపడిన మేడిశెట్టి మోహన్ రాజుని పరామర్శించి డాక్టర్లు వారిని మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులకు100 కెజిల బియ్యం అందజేశారు. మరియు అదే గ్రామంలో ప్రమాదవశాత్తు గాయాలపాలైన నరాల శివని పరామర్శించి డాక్టర్ల సలహా మేరకు వారిని నెల రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోమనడం వల్ల వారికి ₹2000 రూపాయలు 25 కేజీల బియ్యం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, జీ వేమవరం గ్రామ ప్రెసిడెంట్ పుణ్యవంతులు సూరిబాబు, గూడాల నాని, విల్ల వీర, సుంకర చంద్రరావు, దూడల స్వామి, మారుతూర్తి మణికంఠ, కుందు దుర్గాప్రసాద్, గండి అనిల్, నరాల శ్రీనివాసరావు, అంకన ఆంజనేయులు, మందపల్లి సత్యనారాయణ, ఏ సూరి వరప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.