మురళీకృష్ణకు నివాళులర్పించిన హైదరాబాద్ జనసేన
హైదరాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గం, పట్టుమని 30 సంవత్సరాలు కూడా నిండ కుండానే గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మురళీకృష్ణ కారు యాక్సిడెంట్ లో బలమైన గాయాల కారణంగా ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారాం రాజలింగం వెళ్ళి పుష్పగుచ్ఛంతో ఘననివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, వీరమహిళా విభాగం సభ్యురాలు శ్రీమతి వెంకటలక్ష్మి, కార్తిక్, రాజు, రాజేంద్రనగర్ నియోజకవర్గ జనసైనికులు గోపాలకృష్ణ, సురేష్ గుండాల, సారంగా వెంకటేష్, థామస్ బనాల, జానీ, సత్యనారాయణ పాల్గొన్నారు. చిన్న వయసులోనే అతనికి అంత్యక్రియలు జరగటం చూసి అందరూ కంటతడి పెట్టారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-8.17.00-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-8.16.00-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-8.16.00-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-8.15.59-PM-1024x1024.jpeg)