కర్ణాటక జనసేన సంఘం వార్షికోత్సవంలో పాల్గొన్న శివదత్ బోడపాటి

కర్ణాటక రాష్ట్రం, యాద్గిర్ జిల్లాలో “కర్ణాటక జనసేన సంఘం” వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్ ఎమ్ జాగిరిదార్ ఆధ్వర్యంలో జరిగిన మూడవ వార్షికోత్సవంలో పాయకరావుపేట నియోజకవర్గ నాయకులు మరియు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ప్రేమాభిమానం చూపించిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

నా మిత్రుడు మైలారప్ప (ఎమ్ ఎమ్ జాగిరిధార్ ) పవన్ కళ్యాణ్ గారి మీద వున్న అభిమానంతో కర్ణాటక రాష్ట్రంలో జనసేన అభిమాన సంఘం ఏర్పాటు చేసి, పార్టీ ప్రతీ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలో పాల్గొంటూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.