డెంకాడ గ్రామపంచాయతీలో జనంలోకి జనసేన

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ గ్రామపంచాయతీలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జనసేన మేనిఫెస్టోలో ఉన్న షణ్ముఖ వ్యూహం వివరిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వంపై వ్యతిరేకతను గమనించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2024లో జనసేన పార్టీని అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, నాలుగు మండలాలకి చెందిన ముఖ్య నాయకులు దిండి రామారావు, బూర్ల విజయ శంకర్, పతివాడ అచ్చం నాయుడు, పిన్నింటి రాజారావు, తొత్తిడి ప్రకాష్, లింగం రాము, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అదే విధముగా జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.