గంగరేగువలసలో పర్యటించిన బాబు పాలురు

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజక వర్గం, కొమరాడ మండలం, గంగరేగువలసలో రాష్ట ప్రచార కార్యదర్శి బాబు పాలురు నాయకత్వంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా గ్రామంలో పర్యటిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ఎండకడుతు రాబోయే ఎన్నికల్లో మన జనసేన పార్టీ అధికారం లోకి వస్తే మన అందరి జీవితాలు బాగుంటాయని ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుంటుందని ఆయన వివరించడం జరిగింది. అందుకు అనుగుణంగా గ్రామంలో ఉన్న అందరు సానుకూలంగా స్పందించి బాబు పాలూరుని గ్రామస్తులు హారతులతో స్వాగతిస్తూ బ్రహంరధం పట్టారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు బొబ్బిలి, సీతానగరం మరియు కురుపాం నియోజక వర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.