యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జన్మదిన వేడుకలు

విప్లవ వీరుడు అల్లూరి సితారామరాజు గా125 వ జయంతి సందర్బంగా అల్లూరి సితారామరాజు నగర్ లో ఉన్న అల్లూరి విగ్రహంకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ.. సూరీడు ఎలా ఉంటాడో చూడాలనిపిస్తే ఆ విప్లవ మూర్తిని చూపించాలి. తెల్లవారి గుండెల్లో అగ్నిపర్వతంలా పేలిన తెలుగు బిడ్డ.. బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం.. మన్యం ప్రజల గుండె చప్పుడు అల్లూరి సీతారామరాజు అని.. భీమిలి పాండ్రంగి లో అల్లూరి సీతారామరాజు పుట్టడం మన భీమిలి నియోజకవర్గం ప్రజలకి ఎంతో గర్వకారణం అని అన్నారు.. ఈ ప్రాతంలో కడుతున్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం కి అల్లూరి సీతారామారాజు పేరు పెట్టాలి అని జనసేన తరుపున కోరుతున్నామని యడ్ల గణేష్ యాదవ్ తెలియజేసారు. 6వార్డు జనసేన నాయకుడు సంతోష్ నాయుడు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి తో యూవత అంత నడుస్తూ మంచి మంచి కార్యక్రమలు చేస్తున్నారు అని.. తన సొంత నిధులతో విగ్రహం మరమ్మతులు చేయించిన యువతకు అభినందనలు తెలియజేసారు. జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం మహిళా నాయకురాలు ఒమ్మి దేవి యాదవ్ మాట్లాడుతూ.. అల్లూరి స్ఫూర్తి తో అందరూ ముందుకు సాగాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుబీరెడ్డి ప్రసాద్, విజయ్ కుమార్, స్థానిక జనసేన యూవత దిలీప్, వెంకట సాయి, సాయి వర్మ, సునాద్, శ్యామ్, జేమ్స్, గణేష్ విక్కీ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.