అగ్నిప్రమాద బాదితులను ఆదుకున్న పితాని బాలకృష్ణ

జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ పోలవరం మండలం, గోగులంక గ్రామంలో ఈతకోట గోవిందమ్మ, వారి కుమారులు ఈతకోట నాగబాబు, ఈతకోట వాడపల్లి కుటుంబ సభ్యుల నివాస గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన మూడు కుటుంబాలను సోమవారం పరమర్శించి వారికి 10,000 వేల రూపాయలు మరియు బియ్యం, నిత్యవసర వస్తువులు, బట్టలు, అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సాన బోయిన మల్లికార్జున రావు, రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి పండు, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్ధం శెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంనపల్లి జమ్మి, మచ్చ నాగబాబు, దూడల స్వామి, సలాది రాజా, పడాల లక్ష్మణ్, మచ్చ తాతాజీ, కర్రీ చంద్రశేఖర్, మల్లిపుడి రాజ, నిమ్మకాయల సత్తిబాబు, సాధనాల నాని, గుండా బత్తుల రాంబాబు, వడ్డే చిన్న, ఎం నాగబాబు, పి సతీష్, పి నాగేంద్ర, వీరాంజనేయులు, టి వెంకట్రావ్, బి సుబ్రమణ్యం మరియు తదితరులు పాల్గొన్నారు.