పొందూరు మండలంలో గడప గడపకు జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం పాపరాజుపేట మరియు లక్షింపేట గ్రామాలలో, జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని, అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు అసిరి నాయుడు, చిన్నం నాయుడు, అప్పలనాయుడు, బాబురావు, సూర్య, రమణ, రాజు, సిమ్మి నాయుడు, దినేష్ మరియు ఆ గ్రామ జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.