రాబోయే ఎన్నికల్లో జనసేన విజయకేతనం
- చక్రపాణి, రవితేజ ఆధ్వర్యంలో 12వ రోజు కిట్ల పంపిణీ
కైకలూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పండగలాగ మొదలైన 12వ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం సాన రుద్రవరంలో జనసేన ఎంపిటిసి తమ్మానాల మహాలక్ష్మి, తమ్మానాల వాసు లకి మరియు ఇంకా కొంతమందికి కిట్లు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, నియోజకవర్గ నాయకులు వలవల రవితేజ, కేసిరెడ్డి సాయికుమార్ తదితర జనసైనికులు, జనసేన అభిమానులు పాల్గొనడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-05-at-7.16.29-PM-1024x768.jpeg)