తాడిపత్రిలో జనసేన ఆర్థిక సాయం

తాడిపత్రి పట్టణంలోని కారంజ వారి వీధిలో నివాసం ఉంటున్న బలిజ నాగరాజు (51) రెండు నెలల క్రిందట అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయనకు ఒక భార్య కుమార్తె ఉన్నారు వారి కుటుంబ పోషణ కష్టంగా ఉందని తెలుసుకున్న జనసేన నాయకులు ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ 50కెజిల బియ్యం రెండు నెలల సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆ కుటుంబానికి ఎల్లపుడు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి జనసేన నాయకులు కుందుర్తి నరసింహచారి, తాడిపత్రి రాష్ట్ర చిరంజివి యువత అధ్యక్షులు ఆటో ప్రసాద్ ఉపాధ్యక్షులు కుమ్మెత ప్రతాప్ రెడ్డి, సీనియర్ చిరంజీవి అభిమాని మురళి మరియు జనసైనికులు ఎ.అల్తాఫ్, ఎం. గోపాల్, నరేష్ కుమార్ రెడ్డి, షేక్ సాదక్ వలి, బుక్కపట్నం ఇమాంవలి, షేక్ గైబుసా, శివ, తదితరులు పాల్గొన్నారు.