కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి పాలిచర్ల వెంకయ్యను పరామర్శించడం జరిగింది. మనుబోలు మండలం ముద్ద ముడి గ్రామం నందు కిడ్నీ వ్యాధితో ఎంతో ఇబ్బంది పడుతూ కనీసం కళ్ళు కూడా కనిపించనటువంటి పరిస్థితి ముగ్గురు బిడ్డ టీవీలతో జీవనాన్ని కష్ట సాధ్యంగా కొనసాగిస్తున్నటువంటి పాలిచర్ల వెంకయ్య ఆరు నెలల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం గానీ ప్రభుత్వ యంత్రాంగం గాని ఆ కుటుంబానికి ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అతని రెండు కళ్ళు కూడా ఆపరేషన్ చేయించడానికి మేము చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైన దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటే సుధాకర్, పెనుబాక ప్రసాద్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.