ఇంద్రానగర్ కాలనీలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, ఇంద్రానగర్ కాలనీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా.. ప్రతి ఇంటికి జనసేన ఆశయాలు ఆలోచనలు తీసుకెళ్తూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు గురించి వివరించడం జరిగింది. త్వరలోనే పాల్వంచలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమంటున్న కార్యకర్తలు మరియు మహిళలు. ఈ కార్యక్రమంలో రాయపూడి వేణుకి జనసేన క్రియాశీలక కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు కొండా దేవా గౌడ్, సాయి కుమార్ గౌడ్, సాయి గౌడ్, మిద్ది ప్రసాద్ గౌడ్, మడ్డి ప్రసాద్ గౌడ్ మరియు సాయి వంశీ కార్యకర్తలు పాల్గొన్నారు.