మోసగాళ్లకు విక్టరీ వెంకటేష్ వాయిస్‌ ఓవర్‌

మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత నటిస్తూ, నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌  చిత్రం `మోసగాళ్లు`. ఓ సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం.. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ విష్ణుకు చెల్లి పాట్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా రాలేదు. అయితే ఇప్పుడు ఈ మోసగాళ్లు కోసం టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ రంగంలోకి దిగారు.

ఈ సినిమాకు వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు. చిత్రకథ ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆయన నెరేట్‌ చేయనున్నారని చిత్రబృందం తెలిపింది. ఇంతకు ముందు సినిమా థీమ్‌ మ్యూజిక్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు. దానికి, అల్లు అర్జున్‌ విడుదల చేసిన టీజర్‌కి అద్భుత స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.