సానబోయిన నాగప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యులు.. ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సోమవారం ముమ్మిడివరం నగర పంచాయతీ 15వ వార్డులో ఇటీవల యాక్సిడెంట్ లో మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సానబోయిన నాగప్రసాద్ (ఐడి 043-05996) కుటుంబసభ్యులను పరామర్శించి 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అతనికి క్రియాశీలక సభ్యత్వం ఉన్నందున జనసేనపార్టీ నుండి 5లక్షల ప్రమాదభీమా త్వరగా వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. వారి కుటుంబసభ్యులకు జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదశిపుండరీష్, సానబోయిన వీరభద్రరావు, గుర్రాల రాంబాబు, కడలి కొండ, మాదాల శ్రీధర్, మాదాల మనీష్, గుత్తుల రవి, సానబోయిన నానాజీ తదితరులు పాల్గొన్నారు.