పొలిరెడ్డి వెంకట రత్నం ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలుమండలం, తాడిమళ్ల గ్రామంలో మండల అధ్యక్షులు పొలిరెడ్డి వెంకట రత్నం ఆధ్వర్యంలో “జనంలోకి జనసేన” అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో, నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో తాడిమళ్ల సీనియర్ తెలుగుదేశం నాయకులు పూసల బాస్కర రావు, జనసెన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సిద్ధాంతాలు నచ్చి తనవర్గంతో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియ సౌజన్య, జిల్లా సంయుక్తకార్యదర్శి సదా వెంకటేష్,పెండ్యాల ఎంపీటీసీ వాకా ఇంద్రగౌడ్, నిడదవోలు టౌన్ నాయకులు రంగా రమేష్, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్లు యడ్లపల్లిసత్తిబాబు, మూర్తి, యామన కాశీ, పూర్ణ, తాడిమళ్ల దుర్గారావు, నవదుర్గా, కరుణాకర్ తాడిమళ్ల మరియు నిడదవోలు మండల జనసైనికులు పాల్గొన్నారు.