క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన నాదెండ్ల మనోహర్

జగ్గంపేట నియోజకవర్గం, గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేట గ్రామంలో మూడు నెలల క్రితం మన జనసేన క్రియాశీలక సభ్యుడు ఆచంట సూరిబాబు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల మన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడుకున్న 5 లక్షల రూపాయల చెక్కును పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూరిబాబు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమయం తక్కువ ఉండడం వల్ల అందరికీ ఫోన్ చేయలేకపోయినా ఒక్క మెసేజ్ తో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అందరూ ఎంతో అభిమానంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు అందరికీ జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.