ప్రజలందరికీ అండగా ఉండే పార్టీ జనసేన: గిరిడా అప్పలస్వామి

*జనంలోకి జనసేన

బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ గిరిడా అప్పలస్వామి గురువారం 14వ వార్డు 18 వ వార్డు లో గడపలకు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గురించి ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి జనసేన పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు గంగాధర్, పారాది ఎంపిటిసి అభ్యర్థి బంటుపల్లి దివ్య, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

కార్యక్రమంలొ బాగంగా వార్డులో ప్రధాన సమస్యగా.. రోడ్డు అన్ని గోతుల మయం, దుమ్ము ధూళితో కూడుతుందని అక్కడ ప్రజలు తెలియజేశారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని గంగాధర్ హామీ ఇవ్వడం జరిగింది.