నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు

జనసేన సిద్ధాంతాలకు యువత ఆకర్షితులవుతున్నారని, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోనీ మామిడికుదురుకి చెందిన పలువురు గురువారం కాకినాడలో మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేద, బడుగు బలహీనర్గాల సంక్షేమం కోసం ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రియాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలు నచ్చి మామిడికుదురు కి చెందిన ఈలి రాంబాబు, కటకంశెట్టి రామ కృష్ణ ప్రసాద్, జల్లి రమణ, ఉండ్రాజవరపు నాగబాబు, తుమ్మిడి సత్తిబాబు, చింతా ఏసు, ముస్కుడి మురళీ, సళ్ళ శ్రీనివాస్, కాగితాలపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరిశాల బాలాజీ, తాడి మోహన్, గుండాబత్తుల తాతాజీ, జనసేన పార్టీ మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, ఉపాధ్యక్షులు దొడ్డా జైరామ్, సర్పంచ్ ల సమాఖ్య అద్యక్షులు అడబాల తాతకాపు, రుద్రా శ్రీను, మట్టా సత్తిబాబు, ఇంటి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.