రోడ్లు సమస్యలపైన గళమెత్తిన జనసేన జానీ

ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా మాటలు దాటవేస్తు రహదారులు దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వం వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు శుక్రవారం శుక్రవారం ఉదయం మొదటి రోజు పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల నాయుకులు జనసైనికులు పరిసర ప్రాంతాలులో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జానీ మాట్లాడుతూ రోడ్లు సమస్యలపైన గలమెత్తారు. చిదిమి పాలమెట్ట రహదారులు చాలా దారుణంగా పాడైపోయిఉన్నాయి ఈ యొక్క రోడ్లు సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరకి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా చేరే విధంగా మరియు ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చుట్టు ప్రక్కల గ్రామాలకు ఆరోడ్డు పైన వెళ్ళి రావడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు వెల్లి రావడానికి గర్భిణీ స్త్రీలును హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అంటే భయంతో అక్కడిక్కడే మధ్యలోనే డిలివరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయి.అని ఈఅన్యాయాన్ని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది అని ఈరోడ్లు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేన జానీ కోరడమైనది. మంచిపరిపాలన ప్రజలకు రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా ప్రజలు ఎన్నుకోవాలి అని గ్లాజు గ్లాస్ గుర్తుకి ఓటు వెయ్యాలి అని జనసేన జానీ కోరడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నాయుకులు పుండరికం వెంకట్ నాయుడు పవన్ సాయి సుమన్ ప్రణీత్ విద్యార్థులు రైతులు పాల్గొనడం జరిగింది.