సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో రెండవరోజు డిజిటల్ క్యాంపెయిన్

సర్వేపల్లి, ఆంధ్ర రాష్ట్ర రోడ్ల దుస్థితి పై 2వ రోజు అనగా శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో గుంతల రోడ్ల విషమై డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మరమ్మతు చేయాలని ప్రభుత్వానికి నిరసన తెలియజేసే విధంగా ఫ్లక్కార్డుల రూపంలో #ఘూదంఒర్నింగ్ఛంశిర్. పూడిపర్తి ఈదగాలి ఇడిమేపల్లి వడ్డిపాలెం గురువింద పూడి మీదుగా నేషనల్ హైవే కలిసేటువంటి 10 కిలోమీటర్లు రోడ్డు గుంతలమయం నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్లు బుర్రాన్పూర్ కి వెళ్లే రోడ్డు గుంతలమయం చెముడు గుంట కుంకుమపుడి మధ్యలో మట్టి రోడ్డు సర్వేపల్లి నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై గుంతలని ఇప్పటివరకు కూడా మరమ్మతులు చేయకపోవడం శోచనీయం ఇకనైనా ఈ గుంతలపై గంపడు మట్టితో అన్న గుంతలను పూడ్చండి మహాప్రభో నిద్రలేవండి ముఖ్యమంత్రి గారు నిద్రలో ఉన్న వాళ్ళని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడం చాలా కష్ట సాధ్యం ఇకనైనా మీరు మేల్కొంటారని ఆశిస్తున్నామని తెలిపారు.