డిజిటల్ క్యాంపెయిన్ లో మదనపల్లె జనసేన

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో మదనపల్లె టౌన్ దేవతా నగర్ రోడ్డు గుంతలు గుర్తించి గుడ్ మార్నింగ్ సిఎం సార్ డిజిటల్ క్యంపెయిన్లో భాగంగా #GoodMorningCMsir ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు శ్రీనివాస్, దారం హరి, కృష్ణమూర్తి, అశ్వత్, ఆది, కిరణ్, పురుషోత్తం, శివ, పెద్దపాల్యం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.