అండగా ఉంటాం: పెండ్యాల శ్రీలత

అనంతపురం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జనసేనపార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పేర్కొన్నారు. మండల పరిధిలోని కేశేపల్లి గ్రామానికి చెందిన జనసేనపార్టీ క్రియాశీలక సభ్యుడు నీలూరి నారాయణస్వామి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో బాధిత కుటుంబాన్ని పెండ్యాల శ్రీలత పరామర్శించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ మృతుడు నారాయణస్వామి కుటుంబానికి జనసేనపార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి పద్మావతి, గుమ్మడిసాని శిల్ప, కాసెట్టి సావిత్రి, జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, పెండ్యాల చక్రపాణి, నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, భాస్కర్, హరీష్, ప్రదీప్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.