గాఢ నిద్రలో ఉన్న సీఎం మొద్దునిద్ర వీడాలి: కటికం అంకారావు

ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ మరో కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ.. #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా లేవని గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే #GoodMorningCMSir కార్యక్రమం చేపట్టినట్టు ఆయన అన్నారు. ఫోటోలు, వీడియోలు స్వయంగా డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగా దాచేపల్లి నుండి గురజాలకి వచ్చే ప్రధాన రహదారిలోని గుంతలను డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు. రోడ్డు మరమ్మత్తుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లించేస్తున్నారని ఆయన వాపోయారు. 2022 జులై నాటికీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డులను మరమ్మత్తులు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని ఆయన ఏద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర విడి రోడ్ల మరమ్మత్తులు యుద్ధప్రాతిపదికన వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ మెంబెర్ పసుమర్తి మణి, నాయకులు ప్రసాద్, వెంకటనారాయణ, అజీస్, నాగేంద్రబాబు, మధు, కోటేశ్వరావు,తదితర కార్యకర్తలు పాల్గొన్నారు…!