పెనుకొండ మండల జనసేన ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పెనుకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని నిద్రలేపాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాల మేరకు ఆదివారం, పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గం నాయకులు కుమార్ పెనుకొండ మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో పెనుకొండ నుండి మడకశిర ప్రధాన రహదారి మరియు పెనుకొండ నుండి పావగడ ప్రధాన రహదారి మరియు పెనుకొండ డిగ్రీ కాలేజీ, కోనాపురం, కొండాపురం మరియు మంగాపురం వేళ్ళు రోడ్డు ఇలా మండల వ్యాప్తంగా ఉన్న దారుణంగా దెబ్బతిన్న రోడ్లలో చేపలు పడుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే నాయకులు కుమార్, మహేష్, రాజేష్, సురేష్, హరీనాయక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరన్నారాయణ రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా రెండు సంవత్సరాలు ఉండి రెండు సెంటిమీటర్లు కూడా రోడ్డు వేయలేదు ఇది మీకు సిగ్గుగా లేదా మాట మాటకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడం తప్పా ఏమి చేత కాదా దమ్ముంటే మేము ఈ రోజు మేము విసిరిన సవాల్ స్వీకరించి రోడ్ల బాగు చేయండి లేదంటే శెట్టిపల్లిలో జరిగిన మీ సన్మాన కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందని హ్ర్చ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మంజునాథ్, సురేష్ ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, సయ్యద్ బాబా, వీరమహిళ లక్ష్మి, 3వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తిమ్మప్ప కార్యదర్శులు ఆటో నారాయణ, అజయ్, విజయ్, నాయకులు ప్రదీప్, అంజి(బద్రి) ప్రసాద్, శీను తదితరులు పాల్గొన్నారు.