అధికారులు మేల్కొని రెండు రోడ్లను త్వరగా పూర్తి చేయాలని జనసేన డిమాండ్
విజయవాడ, ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అద్వాన పరిస్థితి వల్ల ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులు, ప్రమాదాలు రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సమస్యలు గుర్తించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన సోషల్ మీడియా ఉద్యమం #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన రహదారులలో ఒకటైన ఎర్రకట్ట కింద వించిపేట నుంచి చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, కే.ఎల్ నగర్ తదితర ప్రాంతాలకు రాకపోకల సాగించే ప్రధానమైన ఎర్రకట్ట కింద రోడ్డు సుమారు 5-6 నెలలుగా మూసివేయడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కే.టి రోడ్డు నందు ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బంది అయినప్పుడు ఈ రోడ్డు నందు బస్సులు రాకపోకలు నిర్వహించేవారు, ఇప్పుడు ఈ రెండు రోడ్లను మూసి వేయడంలో ప్రస్తుత వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, అసమర్థత కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు మేల్కొని ఈ రెండు రోడ్లను త్వరగా పూర్తి చేయాలని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యులు నరంశెట్టి కూర్మా రావు, జనసేన పార్టీ 48వ ప్రధాన కార్యదర్శి తమ్మిన చక్రవర్తి తదితరులు కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-7.50.51-PM-1024x822.jpeg)