ఇంటి ఇంటికి జనసేనాని భావజాలం

గుంటూరు: ఇంటి ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి భావజాలం తెలియచేయాలి అనే ఉద్దేశంతో.. జనసేన పార్టీ నాయకుల సహకారంతో గుంటూరు చుట్టుగుంట ప్రాంతము, శివరామ నగర్ 15వ లైను లో కొన్ని కుటుంబాలని కలసి పవన్ కళ్యాణ్ గారి మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకి తెలియజేసి.. వారుమరో పది మంది నీ ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు పమిడి పవన్, లక్ష్మీ శెట్టి సాయి చంద్ (నానీ), దళవాయి రాము, పి. ఫణి కుమార్ శర్మ, చందు శ్రీనివాస రావు, టి. శ్రీనివాస రావు, ఎం డి. రఫీ, మంత్రి లోకేష్, బొల్లా కిరణ్, వి. మహేష్, హమీద్ , రాము మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.