అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే సహించేది లేదు..

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే సహించేది లేదు..

*ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలి…

*వెనుకున్న నేతల పై కేసులు నమోదు చేయాలి.. జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు…

ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం చిగురుకోట పంచాయితీ నరసన్నపాలెం గ్రామంలో భారత దేశ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబెడ్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను శిక్షించకుండా అమాయకులైన వారిని అరెస్ట్ చేయటం సరికాదు అని మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల ఉప అధ్యక్షులు వర్రే హనుమాన్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు జోలికొస్తే సహించేది లేదని ఎంత వార్నైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి సరికాదని విగ్రహాన్ని ధ్వంసం చేసిన చేయించిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఎక్కడ చూసినా అమాయక ఎస్సీ ఎస్టీలను నిర్ధాక్షణంగా చంపటం జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరికట్టడంలో విఫలం అయ్యారన్నారు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటూ… ఆయన విగ్రహాలు ధ్వంసం చేయడం ఎంతవరకు భావ్యమన్నారు. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు… వినకుండా ధ్వంసం చేయించిన రాజకీయ వ్యక్తులను అరెస్టు చేయాలని పోలీస్ శాఖ వారిని కోరారు.