పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ చే ఆహరపొట్లాలు పంపిణీ

కోనసీమ జిల్లా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరావు, ఆయన సతీమణి, అమలాపురం రూరల్ చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ ధన సహాయంతో ఇందుపల్లి మార్కెట్ కాలనీ, బోడసకుర్రు కంసాల తోటలో వరద బాధితులకు 250 మందికి ఆహార పొట్లాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు, ఇందుపల్లి ఉప సర్పంచ్ ఉర్రింకి హనుమాన్ బుజ్జి, వార్డు మెంబర్లు జనసైనికులు పాల్గొన్నారు.