14,15 ఆర్థిక సంఘ నిధులు లేక గ్రామ అభివృద్ధి కుంటు పడింది: జనసేన ఆరోపణ

అరకు: ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ పంచాయతీ నిధులు ప్రభుత్వం దోచుకోవటం మూలన గ్రామాలలో దోమలు బారినపడి వ్యాధులకు గురిఅవుతున్నారు. ఆర్థిక సంఘ నిధులు లేక గ్రామ ప్రజలకు సమాధానం చెప్పలేక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీధి దీపాలు లేక రాత్రిపూట ప్రజలు బయట రావట కష్టంగా ఉంది. గిరిజన గ్రామలలో వీధి దీపాలు లేక గిరిజన ప్రజలు అడవుల నుండి జంతువులు గ్రామాలకు రావడం జరుగుతుంది బ్రిటిష్ కాలంలో వెలుగు లేని గ్రామము గిరిజన గ్రామాలు ప్రదర్శిస్తున్నాయి. రాత్రిపూట వీధి దీపాలు లేక క్రోమ్లోరో పిచకారి లేకపోవడం మూలమున బ్లీచింగ్ లేక దోమలు ఎక్కువ అవ్వటం మూలముగా గిరిజన ప్రజలు దోమకాటుకు గురి అయి మలేరియా డెంగ్యూ వంటి వ్యాధిన పడుతున్నారు అలాగే ఈగల వలన క్యాన్సర్ వ్యాధి న పడుతున్నారని జనసైనికులు మండిపడ్డారు.. మరియు గ్రామ పంచాయతీకి 14.15 ఆర్థిక సంఘ నిధులు లేక పంచాయతీలలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన గిరిజన గ్రామాలకు సర్పంచులు అభివృద్ధికి ముందుకు చేసుకుని వెళ్లలేకపోతున్నారు. అలాగే గిరిజన గ్రామలలో మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. మంచినీటి అందించుటకు కూడా ఈ యొక్క 14.15 నిధులు లేకపోవడం మూలమున గిరిజనులు ఊట లో నీరుని తాగి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రవహించే గడ్డ నీరు మాత్రమే గిరిజనుల దాహం తీరుస్తుంది. గ్రామ పంచాయతీకి 14.15 ఆర్థిక సంఘ నిధులు మండలములలో గిరిజన గ్రామాలకు ఎంతోకొంత మంచినీళ్లు మరియు రోగుల వ్యాధుల నుండి కొంత సహాయ పడేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి గిరిజన కుటుంబ లకు అన్యాయం చేస్తుంది అని జనసేన మండల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దండుసేన నవీన్ కుమార్, కొర్రా ప్రవీణ్ కుమార్, మండల నాయకులు జి మంగళ, కొర్రా రమేష్, వీరమహిళా రత్నప్రియా, పాల్గొన్నారు.