పాఠశాలల విలీన ప్రక్రియపై పోరాడతాం: డా. సందీప్ పంచకర్ల

భీమిలి: జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంఛార్జి డా. సందీప్ పంచకర్ల శుక్రవారం తాటితూరు గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల మరియు జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలని సందర్శించి.. అక్కడ ఉన్న తల్లి తండ్రులని కలిసి పాఠశాల విలీన ప్రక్రియపై చర్చించారు. అక్కడ ఉన్న స్థానికులు మరియు తల్లిదండ్రులు విలీన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విలీన ప్రక్రియపై జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని అక్కడున్న తల్లిదండ్రులకి, స్థానికులకు డాక్టర్ సందీప్ పంచకర్ల భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నాయకులు శ్రీను బాబు, కిరణ్, రాజు, శంకర్ రెడ్డి, అనిల్, శ్రీను, వెంకటేష్, రాజు, హేమంత్, గణేష్ మరియు జనసైనికులు పెద్ద ఎత్తున తాటితురు పంచాయితిలో విలీనం చేస్తున్న ప్రాథమిక పాఠశాలను యధావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.