రామగుండం నియోజకవర్గ జనసేన యువజన విభాగ కమిటీ నియామకం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకవెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూచన మేరకు పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళిక తో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గ మండల జనసేన పార్టీ యువజన విభాగ కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నానని. రానున్న రోజులో పూర్తి స్థాయి యువజన కమిటీలను వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నామని జనసేన పార్టీ తెలంగాణా యువజన విభాగ అద్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.
నూతన కమిటీ నియామకం చేసిన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ మూల హరీష్ గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రావుల మధు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి చల్లా.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-9.12.41-PM-723x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-22-at-9.12.41-PM-1-723x1024.jpeg)