వరద బాదితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన అమలాపురం జనసేన

అమలాపురం రూరల్, ఇందుపల్లి గ్రామంలో ఆకెళ్ళ నారాయణ మూర్తి, ఆజాద్ ఫౌండేషన్, ఆకొండి సింహాచలం ట్రస్ట్, వెంకటరత్నం, బాగోతుల ఉమసోమేశ్వరరావు, పామర్తి వీర రాఘవులు, ఆకెళ్ళ సూర్య కుమారి, బుచెమ్మ అగ్రహారం బ్రాహ్మణ యువత వారి సహాయంతో ఇందుపల్లి గ్రామంలో వరద ముంపున పడి ఇబ్బందులు పడుతున్న వరద బాధిత కుటుంబాలకు సుమారు 1500 మందికి ఆహార పొట్లాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస ఇందు పల్లి గ్రామ ఉపసర్పంచ్ హనుమాన్ బుజ్జి మరియు ఆ గ్రామ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.