నటరాజ మృతి పట్ల జనసేన తరపున రామశ్రీనివాస్ సంతాపం!
అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గం టి. సుండుపల్లి మండలం, ముడుంపాడు, గ్రామపంచాయతీ పరిధిలో పింఛ ప్రాజెక్టు వర్కింగ్ ఇన్స్పెక్టర్ నటరాజ మంగళవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారనే సమాచారం అందుకున్న జనసేన పార్టీ రామశ్రీనివాస్ వారి బృందంతో అక్కడకి చేరుకొని ఆయన భౌతికకాయాన్ని సందర్శిచి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-27-at-12.38.41-PM-1024x461.jpeg)